పంజాబ్ పై విజయం సాధించిన బెంగుళూరు

249
Rcb
- Advertisement -

ఐపిఎల్ 12సీజన్ లో వరుసగా ఓటమి పాలయిన బెంగుళూరు టీం..ఇప్పుడు కొంచెం ఫాంలోకి వచ్చింది. వరుసగా మూడు మ్యాచ్ లలో విజయం సాధించింది బెంగుళూరు. నిన్న రాత్రి పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో బెంగుళూరు విజయం సాధించింది. పంజాబ్ పై 17పరుగుల తేడాతో బెంగుళూరు గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగుళూరు నిర్ణిత 20ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 202పరుగులు చేసింది. ఓపెనర్ డివిలియర్స్ విభృంబించడంతో బెంగుళూరు భారీ స్కోరు నమోదు చేసింది.

డివిలియర్స్ 44 బంతుల్లో 82పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి 8బంతుల్లో 13పరుగులు చేసి అవుట్ అయ్యాడు. స్టొయినిస్‌ 34బంతుల్లో 46పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ నిర్ణిత 20ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 202పరుగులు చేసింది. పూరన్ 28బంతుల్లో 46 పరుగులు చేసి అవుట్ కాగా, కేఎల్ రాహుల్ 27బంతుల్లో 42పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఉమేశ్ యాదవ్ 3వికెట్లు, సైనీ 2వికెట్లు దక్కించుకున్నారు.

- Advertisement -