పంత్ స్ధానంలో సాహ..తొలిటెస్టు టీం ఇదే

571
india vs south africa
- Advertisement -

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ డ్రాగా ముగియడంతో టెస్టు సిరీస్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది కోహ్లీ సేన. రేపటి నుంచి విశాఖ వేదికగా జరిగే తొలి టెస్టులో సత్తాచాటేందుకు సిద్ధమైంది. ఈ మేరకు తొలి టెస్టులో తలపడే భారత జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించింది.

మొదటినుంచి అంతా ఊహించినట్లుగానే యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌పై వేటు పడింది. పంత్ స్ధానంలో వృద్ధిమాన్‌ సాహా తిరిగి జట్టులోకి వచ్చాడు. సాహతో పాటు అశ్విన్ కూడా తుదిజట్టులో చోటు దక్కించుకున్నారు. చివరి సారిగా 2018 జనవరిలో సౌతాఫ్రికా టూర్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడాడు.

భారత జట్టు:

విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రహానె(వైస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, అశ్విన్‌, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్‌ సాహా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ

- Advertisement -