తెలంగాణలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు

410
Mayor
- Advertisement -

తెలంగాణలో 71వ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గోన్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ డా.ఎస్.హరీష్. అనంతరం కలెక్టర్ హరీశ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

గణతంత్ర దినోత్సవమును పురస్కరించుకొని జీహెచ్ ఎం సి కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా డిప్యూటీ మేయర్ మహమ్మద్ బాబా ఫసియుద్దీన్ హాజరయ్యారు . ఈ సందర్బంగా మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి చెక్కులు, వృద్ధులకు వీల్ చైర్స్, చేతి కర్రలు పంపిణీచేశారు.

మరోవైపు తెలంగాణ హైకోర్టులో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండా ని ఆవిష్కరించారు చీఫ్ జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్. ఈ వేడుకల్లో పలువురు న్యాయమూర్తులు,న్యాయవాదులు, కోర్ట్ సిబ్బంది పాల్గోన్నారు.

- Advertisement -