ప్రభాస్’ జాన్’ లో కృష్ణం రాజు

434
Prabhas krishnam Raju.jpeg
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రం తర్వాత జాన్ మూవీలో నటిస్తున్నాడు. జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి కృష్ణంరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇటివలే ప్రభాస్ ఈమూవీ షూటింగ్ జాయిన్ అయ్యాడు. ప్రభాస్ సరసన పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

తాజాగా ఉన్న సమాచారం ప్రకారం ఈసినిమాలో రెబల్ స్టార్ క్రిష్ణం రాజు కీలకపాత్రలో కనిపించనున్నారట. కృష్ణంరాజు పాత్ర చాలా పవర్ ఫుల్ ఉండేలా దగ్గరుండి మరి రాయించుకున్నారట ప్రభాస్. ఈమూవీని ఆగస్ట్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. కాగా ప్రభాస్ కృష్ణంరాజు కాంబినేషన్ లో తెరకెక్కిన బిల్లా, రెబల్ సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ ఈసారి ఆ సెంటిమెంట్ ను ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తుంది. ఎలాగైన పెదనాన్న కృష్ణంరాజుతో ఒక హిట్ కొట్టాలని భావిస్తున్నాడు ప్రభాస్.

- Advertisement -