- Advertisement -
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి ఇవాళ రాజీనామా చేశారు. ఆర్బీఐకి సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల తక్షణమే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు ఉర్జిత్ పటేల్. ఆర్బీఐ సెంట్రల్ బోర్డు డైరక్టర్లకు ఆయన కృతజ్క్షతలు తెలిపారు. ప్రభుత్వంతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంకులో ఉన్న నగదు నిల్వల్లో కొంత భాగాన్ని తమకు ఇవ్వాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తోంది. ఈ ప్రతిపాదనను ఊర్జిత్ పటేల్ తో పాటు మరి కొందరు బోర్డు సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, ఆయన రాజీనామా చేశారు.
- Advertisement -