కన్ఫామ్.. టీడీపీకి షాకివ్వనున్న రాయపాటి…!

390
rayapati
- Advertisement -

ఏపీలో టీడీపీకి మరోషాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సైకిల్ దిగి కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు బీజేపీ నేత రాంమాధవ్‌తో భేటీ అయ్యారు రాయపాటి. బీజేపీలో చేరికపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీలో కీలకంగా ఉన్న రాయపాటి…తర్వాత టీడీపీలో చేరారు. తాజాగా టీడీపీ అధికారం కొల్పోవడంతో ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు అనుచరుల వద్ద రాయపాటి తెలిపినట్లు సమాచారం. మరికొద్దిరోజుల్లోనే రాయపాటి బీజేపీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

గుంటూరు రాజకీయాల్లో రాయపాటికి మంచిపట్టుంది. టీడీపీలో చేరిన తర్వాత ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు రాయపాటి. తాజాగా ఆయన టీడీపీని వీడుతుండటం ఆ పార్టీకి గట్టిషాకేనని రాజకీయవిశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే సీనియర్ నేతలు,రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరడం..మరికొంతమంది సైకిల్ పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండటంతో ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

- Advertisement -