విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ రంగస్థలంతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు సుకుమార్. ఈ మూవీ విడుదలై ఏడాదిన్నర కావొస్తుండటంతో తన నెక్ట్స్ ప్రాజెక్టు బన్నీతో చేయనున్నాడు సుక్కు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ తో పాటు మ్యూజిక్ సిట్టింగ్స్లో బిజీగా ఉన్న సుకుమార్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మీకా మందన్న హీరోయిన్గా నటించనుంది. ప్రస్తుతం మహేష్తో సరిలేరు నీకెవ్వరు చేస్తున్న ఈ బ్యూటీ ఈ సినిమా పూర్తికాగానే సుకుమార్ మూవీలో జాయిన్ కానుంది.
ఇక ఇప్పటవరకు గీతాగోవిందం,డియర్ కామ్రేడ్,ఛలో మూవీలో మెట్రో సిటీ అమ్మాయిగా కనిపించిన రష్మీకా తొలిసారి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్లను సిద్ధం చేసే పనిలో ఉన్నాడట. ఓవరాల్గా విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ అయిన ఈ మూవీతో సుకుమార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచిచూడాలి.