భీష్మ తర్వాత అల్లు అర్జున్‌తో చేస్తున్నా: రష్మికా

514
allu arjun
- Advertisement -

టాలీవుడ్‌లో అనతికాలంలో అగ్రహీరోయిన్‌గా ఎదిగిన బ్యూటీ రష్మికా మందన్నా. ప్రస్తుతం నితిన్ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్శ్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సినిమా ‘భీష్మ’లో హీరోయిన్ గా నటించింది . వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 21న విడుదలవుతోంది.

ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించింది రష్మికా. భీష్మ తర్వాత అల్లు అర్జున్‌తో మూవీ చేస్తున్నానని మార్చిలో సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతానని చెప్పారు.

‘భీష్మ’ అనేది ఆర్గానిక్ వ్యవసాయం గురించిన కథ కాదు. ఇది ఒక వ్యక్తి ప్రయాణం అని చెప్పిన రష్మికా…. ఆర్గానిక్ వ్యవసాయం అనేది అతని జర్నీలో ఒక భాగం. ఒక్క మాటలో చెప్పాలంటే ‘భీష్మ’ చాలా మంచి సినిమా అని చెప్పుకొచ్చింది.

నితిన్‌తో సినిమా చేయడం థ్రిల్‌ ఇచ్చిందని చెప్పిన రష్మికా……మొదట తనతో చెయ్యడం సౌకర్యంగా ఉంటుందా, లేదా అనుకున్నా. కానీ తను ఒక కాలేజ్ బాయ్ లా కనిపించారు. కూర్చొని ఫోన్ చూసుకుంటూ, వెంకీతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారు. దాంతో నేను సౌకర్యంగా ఫీలయ్యా. కాలేజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా అయిపోయాం అన్నారు. ఎంగేజ్‌మెంట్‌కు రెండు రోజుల ముందు నితిన్ లవ్ స్టోరీ గురించి తెలిసిందని చెప్పుకొచ్చింది రష్మికా.

- Advertisement -