4 రోజుల్లో 40మంది రేప్ చేశారు..

230
Raped By 40 Men For 4 Days In Haryana
- Advertisement -

దేశంలో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. స్వ‌తంత్ర్యం వ‌చ్చి 70 ఏళ్లు వ‌చ్చినా ఇంకా ఆడ‌పిల్ల‌ల‌పై అత్యాచారాలు జ‌రుగుతూనే ఉన్నాయి. మాన‌భంగాలు, మ‌ర్డ‌ర్ లు చేస్తూ ప‌నిపిల్ల‌ల‌ను కూడా వ‌ద‌ల‌కుండా అత్యాచారం చేస్తున్నారు దుర్మార్గులు. ఆడ‌పిల్ల ఒంట‌రిగా క‌నిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. దేశంలో ఆడ‌పిల్ల‌ల‌పై జ‌రుగుతున్న అరాచ‌కాలు చూస్తుంటే గుండెలు బ‌ద్ద‌ల‌వుతున్నాయి. ముక్కుప‌చ్చ‌లార‌ని చిన్న పిల్ల‌ల‌పై కూడా మాన‌భంగం చేస్తున్నారు.

rape

తాజాగా చైన్నైలో 11ఏళ్ల బాలిక‌పై 65 ఏళ్ల ముస‌లాయ‌న అత్యాచారం చేయ‌డ‌మే కాకుండా ఆచిన్న పిల్ల‌ను మ‌రికొంద‌రితో క‌లిసి అత్యాచారం చేశాడు. ఈవార్త భార‌త‌దేశ ప్ర‌జానికాన్ని షాక్ కు గురిచేసింది. ఇక ఇది మ‌రువ‌క ముందే మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తాన‌ని చెప్పి నాలుగు రోజులుగా త‌న‌ను అత్యాచారం చేసారని తాజాగా పోలీసుల‌ను ఆశ్ర‌యించింది ఓ యువ‌తి. ఈఘ‌ట‌న హ‌ర్యానాలోని మోర్నిహిల్స్ లో జ‌రిగింది.

22ఏళ్ల వివాహిత‌ను ఉద్యోగం ఇప్పిస్తామ‌ని చెప్పి ఒక అతిధి గృహం నిర్భందించి నాలుగు రోజులుగా ఒకరి త‌ర్వాత ఒక‌రు త‌న‌పై అత్యాచారం చేశార‌ని తెలిపింది. ఆమెకు మ‌త్తు మందు ఇచ్చి ఈదారునానికి పాల్ప‌డ్డార‌ని ఆమె భ‌ర్త చెప్పారు. చివ‌ర‌కు ఆమె ఎలాగో ఫోన్ సంపాదించి త‌న భ‌ర్త‌కు ఫోన్ చేయ‌డంతో అత‌ను పోలీసుల‌కు చెబుతాన‌ని బెదిరించ‌డంతో ఆమెను విడిచిపెట్టారు. ఈఘ‌ట‌న పై కేసు న‌మోదు చేస‌కున్న పోలీసులు ఈకేసు సిరీయ‌స్ గా తీసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితుల‌ను ప‌ట్టుకుని క‌ఠిన మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. ఈఘ‌ట‌న జ‌రిగిన అతిధి గృహం ఓన‌ర్ తో పాటు మ‌రో మ‌గ్గురుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

- Advertisement -