పాట పాడితే బిస్కెట్ ఇచ్చేవారు:రాణు మోండాల్

916
ranu mondal
- Advertisement -

పాట పాడితే బిస్కెట్ ఇచ్చేవారని తెలిపింది రాణు మోండల్. కోల్ కతా రైల్వే స్టేషన్‌లో ఏక్ ప్యార్ హా అంటూ ఆమె పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ బాలీవుడ్ షోలో పాల్గొన్న రాణు…పొట్టకూటి కోసం పాటలు పాడే దాననిని తెలిపారు.

పాట పాడితే కొంతమంది బిస్కెట్లు ఇచ్చేవారు,మరికొంతమంది అన్నం పెట్టేవారని చెప్పారు. ఇంకొంతమంది డబ్బులు ఇచ్చేవారని తనకు సొంత ఇళ్లు లేకపోవడంతో రైల్వే స్టేషన్‌లో ఉండేదానని చెప్పి  అందరిచేత కన్నీళ్లు పెట్టించింది.

ఈ నేపథ్యంలో ఈ షోలో ఆమెకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు బాలీవుడ్ సంగీత దర్శకుడు ఇమ్రాన్ హష్మీ. తన అప్ కమింగ్ మూవీ హ్యాపీ హర్డీ అండ్ హీర్ సినిమాలో పాడే అవకాశం ఇస్తానని చెప్పారు. చెప్పిన విధంగానే రాణు చేత పాటపాడించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.

ప్రస్తుతం రాణు పాడిన తేరి మేరి మేరి కహానీ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అచ్చం లతా మంగేష్కర్‌లా రాణు పాడిన సాంగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటివరకు లక్షల సంఖ్యలో ఆమె పాటలను చూడగా అంతేసంఖ్యలో నెటిజన్లు షేర్ చేస్తున్నారు.

https://youtu.be/GL8WVSoZuoM

- Advertisement -