ఉత్తరాఖండ్‌లో రజనీ..

235
rajanikanth
- Advertisement -

ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ ఉత్తరాఖండ్‌లో పర్యటిస్తున్నారు. రిషికేషిలోని స్వామి దయానంద ఆశ్రమంలో సన్యాసులకు ఏర్పాటుచేసిన సహపంక్తి భోజనాలను వడ్డించారు. వారితో కలిసి మాట్లాడిన రజనీ త్వరలోనే పూర్తిస్ధాయి రాజకీయాల్లోకి రానున్న సంగతి తెలిసిందే.

ఇక ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆయన సందర్శించారు. అయితే గతంలో రజనీ ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చిన సందర్భాలు తక్కువ. కానీ ఈసారీ దానికి భిన్నంగా రజనీ ఎక్కడున్నాడు..అక్కడ ఆయన సందర్శించిన ప్రదేశాల ఫోటోలు వెంటవెంటనే బయటకు వస్తుండటం విశేషం. అంతేగాదు కొన్నిసందర్భాల్లో రజనీ మీడియాతో సైతం మాట్లాడుతు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ని అందిస్తున్నాడు.

ప్రస్తుతం రజనీ 2.0, కాలా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలతో పాటు వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో 234 స్ధానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాడు రజనీ.

Rajinikanth meets saints at Swami Dayananda Ashram

- Advertisement -