చిరు సైరా కోసం వస్తున్న కాలా…?

500
rajinikanth chiru
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్.

మంగళవారం విడుదల చేసిన సైరా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర అప్ డేట్ వచ్చేసింది. బాలీవుడ్,కోలీవుడ్,శాండల్‌వుడ్‌కు చెందిన అగ్రనటులు ఈ సినిమాలో నటించగా రజనీ కూడా పాలు పంచుకోబోతున్నారట.

తెలుగు టీజర్‌కు పవర్ స్టార్ పవన్ వాయిస్ ఓవర్ ఇవ్వగా తమిళ టీజర్‌కు రజనీ చేత వాయిస్ ఓవర్ ఇప్పించే పనిలో ఉందట చిత్రయూనిట్. రజనీ-చిరంజీవి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన ఓకే చెబుతారని అంతా భావిస్తున్నారట.

చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటించగా బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, కోలీవుడ్‌ సంచలన నటుడు విజయ్‌సేతుపతి, కన్నడ సూపర్‌స్టార్‌ సుదీప్, జగపతిబాబు, నటి తమన్నా, అనుష్క వంటి ప్రముఖ నటులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌ నిర్మిస్తుండగా ఐదు భాషల్లో మూవీ విడుదల కానుంది.

- Advertisement -