ప్రభాస్‌-మహేష్‌తో రాజమౌళి మల్టీస్టారర్‌..!

403
rajamouli
- Advertisement -

బాహుబలి తర్వాత దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్-మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ కాంబోలో శరవేగంగా తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 8న ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇక ఈ సినిమా సెట్స్ పై ఉండ‌గానే, రాజ‌మౌళి త‌ర్వాతి ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆసక్తికర వార్తలు టీ టౌన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత రాజ‌మౌళి చేసే ప్రాజెక్ట్ మ‌ల్టీస్టార‌ర్‌గానే ఉంటుంద‌ని, ఇందులో మ‌హేష్ బాబు ,ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌నున్నార‌ని చెప్పుకొస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్‌ త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్ర‌భాస్‌తో ఛత్రపతి,బాహుబలి సినిమాలు చేసిన జక్కన్న…. మహేష్‌తో మాత్రం తొలిసారి సినిమా చేయనున్నాడు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియదు గానీ ఒకవేళ నిజం అయితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవని పలువురు చెబుతున్నారు.

- Advertisement -