రాజ్‌ తరుణ్‌ మందు తాగలేదు:రాజా రవీంద్ర

758
raja ravindra
- Advertisement -

రాజ్ తరుణ్ మందు తాగి వాహనం నడపలేదని రాజ్ తరుణ్ మేనేజర్,సినీ నటుడు రాజా రవీంద్ర తెలిపారు. నార్సింగి వద్ద రాజ్ తరుణ్ కారు యాక్సిడెంట్ అవడం,ఈ ఘటనకు సంబంధించి ఆయన పారిపోతున్న వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చారు రాజా రవీంద్ర. రాజ్‌తరుణ్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌ చేయడం వల్లే యాక్సిడెంట్ జరిగిందని కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కార్తీక్‌ చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. రాజ్‌తరుణ్‌కు సంబంధించి ఆధారాలు ఉన్నాయని,రూ. 3 లక్షలు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని రాజారవీంద్ర ఆరోపించారు.

రాజ్‌తరుణ్‌పై చేస్తున్న ఆరోపణలపై న్యాయపోరాటం చేస్తామని రాజారవీంద్ర స్పష్టం చేశారు. కార్తీక్‌ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రాజారవీంద్ర చెప్పారు. ఈ కేసులో పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తామని, రెండురోజుల్లో రాజ్‌తరుణ్‌ షూటింగ్‌కు వస్తాడని వెల్లడించారు.

- Advertisement -