- Advertisement -
సినీనటుడు,ఎంఎన్ఎం పార్టీ అధినేత కమల్ హాసన్తో భేటీ అయ్యారు తెలుగుతేజం, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. చెన్నైలోని ఎంఎన్ఎం పార్టీ ఆఫీసులో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కమల్తో కలిసి లంచ్ చేశారు సింధు.
బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్షిప్ గెలిచి భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటారంటూ సింధుపై కమల్ ప్రశంసల వర్షం కురిపించారు. 2020లో టోక్యో వేదికగా జరగనున్న ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడమే తన లక్ష్యమని వెల్లడించారు సింధు. ఇందుకోసం నిత్యం సాధన చేస్తానని తెలిపారు. ఈ మర్యాదపూర్వక భేటీకి సింధుతో పాటు ఆమె తల్లికూడా వచ్చారు. కమల్ పార్టీ కార్యాలయానికి సింధు వెళ్లడంపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.
- Advertisement -