పునాదిరాళ్లు దర్శకుడు మృతి..

461
punadirallu
- Advertisement -

ప్రముఖ సినీదర్శకుడు గుడిపాటి రాజ్‌ కుమార్ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. రాజ్ కుమార్ స్వస్థలం కృష్ణా జిల్లా ఉయ్యూరు.

చిరంజీవి నటించిన తొలి చిత్రం పునాదిరాళ్లు సినిమాకు దర్శకత్వం వహించారు రాజ్ కుమార్‌. మొదటి సినిమాకే ఐదు నంది అవార్డులు గెలుచుకుని మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న రాజ్‌కుమార్‌ని అపోలో ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించారు చిరంజీవి. ఇటీవలె రాజ్ కుమార్ పెద్ద కుమారుడు చనిపోవడం తర్వాత భార్య కూడా మృతి చెందడంతో కుంగిపోయారు. స్వస్థలం ఉయ్యూరులో రాజ్ కుమార్ అంత్యక్రియలు జరగనున్నాయి.

- Advertisement -