కేసీఆర్‌..ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చారు:ప్రొ నాగేశ్వర్‌

532
prof nageshwar
- Advertisement -

కేసీఆర్ ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చారని గుర్తు చేశారు రాజకీయ విశ్లేషకులు,ప్రొ నాగేశ్వర్‌. ఏపీకి ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడిన నాగేశ్వర్‌…ఇద్దరు ఎంపీలతో కేసీఆర్ తెలంగాణ తెస్తే…22 మంది ఎంపీలతో జగన్‌ ప్రత్యేక హోదా తేలేరా అని ప్రశ్నించారు.

ఏపీలో వైసీపీ ముందున్న పెద్ద సవాల్‌ ప్రత్యేక హోదా అని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీలతో రాజీనామా చేయించడం,ఢిల్లీ ధర్నాలు చేసిన జగన్‌..అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా ప్రయత్నాలు చేయలదనిపిస్తుందన్నారు. ఢిల్లీలో తొందరపడి బీజేపీకి పూర్తి మెజార్టీ ఉందని ఇప్పుడు ఏం చేయలేమని వ్యాఖ్యానించి నాలుక కరుచుకున్నారని చెప్పారు.

అయితే తర్వాత దిద్దుబాటు చర్యల్లో భాగంగా బీజేపీ ఇచ్చిన డిప్యూటీ స్పీకర్‌ ఆఫర్‌ని తిరస్కరించి జాగ్రత్త పడ్డారని చెప్పారు. 2014లో చంద్రబాబుది 2019లో జగన్‌ది ఇదే పరిస్థితి అన్నారు. 2014లో,2019లో బీజేపీ పూర్తి స్ధాయి మెజార్టీతో అధికారంలోకి రావడంతో ఏపీకి ప్రత్యేక హోదా నాడు వైసీపీకి ఆయుధంగా మారితే ఇప్పుడు టీడీపీకి ఆయుధంగా మారే అవకాశం ఉందన్నారు. కేవలం నెంబర్ గేమ్ ముఖ్యమనుకుంటే ఇద్దరు ఎంపీలతో కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చారని చెప్పారు నాగేశ్వర్‌.

- Advertisement -