హ్యాట్రిక్‌..అదుర్స్‌..!

195
Pro Kabaddi ,Pro Kabaddi League 2017,Catch ,Gujarat Fortunegiants ,Gujarat ,
- Advertisement -

పట్నా పైరేట్స్  ప్రొ కబడ్డీ ఐదో సీజన్‌ తుది పోరులో  విజేతగా అవతరించింది. గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 54- 38 తేడాతో విజయం సాధించి వరుసగా మూడోసారి టైటిల్ సాధించింది.

తొలి అర్థభాగం ముగిసేసరికి 21- 18 ఆధిక్యంతో నిలిచిన పట్నా రెండో భాగంలోనూ అదే జోరు కొనసాగించింది. ఈ సీజన్‌లో 350 రైడింగ్ పాయింట్లు సాధించిన స్టార్ ఆటగాడు ప్రదీప్ నర్వాల్ ఫైనల్ పోరులో 18 రైడ్ పాయింట్లు సాధించి సత్తా చాటాడు.

రైడింగ్ వెళ్లిన ప్రదీప్ రెండుసార్లు ఐదు పాయింట్లు, ఒక సారి మూడు పాయింట్లు సాధించడం గమనార్హం. మరోవైపు గుజరాత్ జట్టు కూడా తుది వరకు విజయం కోసం పోరాడింది. పట్నా తరఫున జయదీప్ అత్యధిక ట్యాకెల్ పాయింట్లు సాధించాడు. పాయింట్లు సాధించడంతో మోనూ గోయత్ కూడా తన వంతు సహకారం అందించడంతో పట్నా విజయం సులువైంది. గుజరాత్ తరఫున సచిన్ తన్వర్ 10 పాయింట్లు సాధించాడు. లీగ్ దశలో అగ్రస్థానం సాధించి క్వాలిఫయర్- 1లో బెంగాల్ వారియర్స్‌ను చిత్తుగా ఓడించి దర్జాగా ఫైనల్ చేరిన గుజరాత్ ఫార్చ్యూన్స్ ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేసింది.

- Advertisement -