న్యూజిలాండ్‌తో జరిగే వన్డేలకు భారత్ జట్టు ఇదే

365
Team india
- Advertisement -

వరుస విజయాలతో జోరు మీదున్న టీంఇండియా మరో సిరీస్ కు సిద్దంగా ఉంది. వచ్చే నెల 5వతేది నుంచి న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ జరగునుంది. ఇందుకోసం భారత జట్టను ప్రకటించింది సెలక్షన్ కమిటీ. ఈ మ్యాచ్ కు ధావన్ దూరంగా ఉన్నాడు. గత మ్యచ్ లో ఫిల్డింగ్ చేస్తున్న సమయంలో జరిగిన గాయం కారణంగా ధావన్ ను చోటు దక్కలేదు. ధావన్ స్ధానంలో డోపింగ్‌ పరీక్షల్లో విఫలమై ఎనిమిది నెలల నిషేధం ఎదుర్కొన్నాక జాతీయ జట్టుకు పృథ్వీ తొలిసారి ఎంపికయ్యాడు. వన్డేల్లో కేదార్‌ జాదవ్‌ తన స్థానాన్ని కాపాడుకున్నాడు. భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య ఫిబ్రవరి 5, 8, 11 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి.

వన్డే జట్టు: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), పృథ్వీ షా, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషబ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), శివమ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్‌, యజ్వేంద్ర చాహల్‌, రవీంద్ర జడేజా, జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీ, నవ్‌దీప్‌ సైనీ, శార్దూల్‌ ఠాకూర్‌, కేదార్‌ జాదవ్‌

- Advertisement -