ప్రభాస్ తో కొరటాల శివ!

458
Koratala Shiva Prabhas.jpeg
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జాన్ మూవీలో నటిస్తున్నాడు. జిల్ మూవీ దర్శకుడు రాధాకృష్ణ ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని మూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకుంటుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఏడాది మొద‌ట్లో విడుద‌ల‌వుతుంద‌ని అభిమానులు భావించినిప్ప‌టికి, సినిమా స‌మ్మ‌ర్ తర్వాత రిలీజ్ అయ్యే అవ‌కాశాలు ఎక్కువ ఉన్నాయ‌ని అంటున్నారు.

కాగా ఈమూవీ తర్వాత ప్రభాస్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని ఫిలిం నగర్ వర్గాల్ ప్రచారం జరుగుతుంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మిర్చి చిత్రం భారీ హిట్ కొట్టిన విష‌యం తెలిసిందే. మిర్చి సినిమాతోనే కొరటాల శివ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మిర్చి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన కొరటాలతో ప్రభాస్ మరో సినిమా చేయడానికి సిద్దమయ్యాడు. ఈమూవీకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేస్తున్నాడు. ఈమూవీ ఆగస్ట్ లో విడుదల కానుంది.

- Advertisement -