ఎన్టీఆర్, ప్రభాస్‌లతో రాజమౌళీ మల్టీస్టారర్‌..!

308
- Advertisement -

బాహుబలి విజయం తో దేశం మొత్తాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇప్పుడు బాహుబలి 2తో మరోసారి ప్రభంజనం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీ తరువాత రాజమౌళి తన అమ్ముల పోదిలోంచి మరో పదునయిన ఆయుధాన్ని బయటకు తీయనున్నాడు. అదే తన కలలకు ప్రతిరూపం మహాభారతం. బహుభాలి 2 చిత్రీకరణ ఈ నవంబర్ కల్లా పూర్తికానుంది. ఆ తరువాత గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసి, వచ్చే ఏడాది ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఇదంతా పూర్తయిన వెంటనే రాజమౌళి మహాభారతం మొదలు పడుతాడని టాక్.

ఇప్పటికేమహాభారతాన్ని సినిమాగా తియ్యాలన్న కోరికని బయటపెట్టిన జక్కన్నకు బాహుబలి విజయం కావాల్సినంత ధైర్యాన్నిచ్చింది. ఇదే విషయం రాజమౌళి తండ్రి, విజయేంద్ర ప్రసాద్ కూడా పలు సందర్భాల్లో చెప్పారు. ఇక మరో విశేషమేంటంటే.. మహాభారతంలో కూడా ప్రభాస్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి, ప్రభాస్ ని మహాభారతంలో నటించడంపై అడిగినట్లు టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఏకంగా ఈ సినిమా కోసం..మరో 5 ఏళ్ల సమయం కేటాయించాలని కూడా రాజమౌళి అడిగినట్టు చెబుతున్నారు. నిజానికి మహాభారతంలో ఎన్టీఆర్ నటిస్తాడని మొదటినుంచి వార్తలు వినిపించాయి. అయితే మహాభారతంలో అన్ని కీలక పాత్రలే కావడంతో ఇది మల్టీస్టారర్ గా తెరకెక్కే అవకాశాలున్నట్లు తెస్తోంది. ఈ రకంగా చూస్తే.. ఎన్టీఆర్, ప్రభాస్ కలిసి ఈ సినిమాలో నటించే అవకాశం లేకపోలేదు.

- Advertisement -