టీచర్‌గా మారనున్న పూజా హెగ్డే..!

500
- Advertisement -

సాహో తర్వాత ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జాన్’. ఈ మూవీ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూటింగును జరుపుకుంది. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది.

Prabhas

అయితే ఈ సినిమాలో పూజా స్కూల్ టీచర్ పాత్రలో డిఫరెంట్ లుక్‌తో కనిపించనుందని అంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 1960 కాలంలో యూరప్‌లో జరిగిన ఒక అందమైన ప్రేమకథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందుతుండటం విశేషం.

ఇక ప్రస్తుతం టాలీవుడ్‌లో పూజా హెగ్డే వరుస విజయాలతో జోరు కొనసాగుతోంది. ‘గద్దలకొండ గణేశ్’ సినిమాలో ఆమె పోషించిన పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. లంగావోణీతో ఈ సుందరి కుర్రకారు మనసులను దోచేసింది. మరోమారు ఆమె డిఫరెంట్ లుక్‌తో ‘జాన్’ మూవీలో కనిపించనున్నట్టుగా ఫిలిం వర్గాల సమాచారం.

- Advertisement -