తెలుగు సినిమాలకు బ్రేక్…. పూజా హెగ్డే!

544
pooja
- Advertisement -

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోన్న బ్యూటీ పూజా హెగ్డే. వరుణ్ తేజ్ ‘ముకుంద’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ అరవింత సమేతతో హిట్ ట్రాక్ ఎక్కింది. తర్వాత మహేష్‌తో ‘మహర్షి’,వరుణ్‌తో ‘గద్దలకొండ గణేష్‌’లో ఆడిపాడింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ ‘హౌస్‌ఫుల్ 4’ దీపావళి కానుకగా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇక టాలీవుడ్‌లో అల్లు అర్జున్ సరసన అల వైకుంఠపురములో మూవీ చేస్తుండగా ప్రభాస్‌తో జాన్ సినిమాకు కమిట్ అయింది పూజా. దీంతో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మూవీకి కమిట్ అయింది ఈ బ్యూటీ.

అయితే తాత్కాలికంగా తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది పూజా. హౌస్‌ఫుల్ 4 విడుదలకు సిద్ధంగా ఉండటంతో మూవీ ప్రమోషన్స్‌ కోసం షార్ట్ బ్రేక్ ఇచ్చింది పూజా. అక్షయ్ కుమార్, బాబీ డియోల్, రితేష్ దేశ్‌ముఖ్, కృతి సనన్, కృతి ఖర్బంద, నవాజుద్దీన్ సిద్ధిఖి వంటి స్టార్లు నటించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

pooja hegde

- Advertisement -