మరోసారి మహేశ్ బాబుతో పూజా హెగ్డె

371
Mahesh babu Pooja hedge
- Advertisement -

టాలీవుడ్ లో పూజా హెగ్డె హవా నడుస్తోంది. స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. వరుస సక్సెస్ ల కారణంగా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాల్లో నటించి సక్సెస్ లు సాధించింది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ తో అల వైకుంఠపురంలో సినిమాలో బిజీగా ఉంది. అలాగే ప్రభాస్ తో జాన్ మూవీలో కూడా నటిస్తుంది.

ఇప్పటికే ఎన్టీఆర్, మహేశ్ బాబులతో నటించింది. తాజాగా ఉన్న సమచారం ప్రకారం ఆమె మరోసారి మహేశ్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మహేశ్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నటిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలీం సిటిలో జరుగుతుంది.

ఈమూవీలో రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఇక స్పెషల్ సాంగ్ కోసం తమన్నాను తీసుకోగా..మరో పాట కోసం పూజా హెగ్డెను తీసుకున్నారని సమాచారం. ఇందుకు పూజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. . మరికాస్త గ్లామర్ టచ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే దర్శక నిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. సంక్రాంతికి ఈమూవీ థియేటర్లలోకి రానుంది.

- Advertisement -