అఖిల్ సరసన పూజా హెగ్డె

363
Pooja Hedge
- Advertisement -

ముకుంద సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డె ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అల్లు అర్జున్ డీజే సినిమా తర్వాత పూజా హెగ్డెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. వరుసగా స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తుంది. ఇటివలే మహేశ్ బాబుతో మహర్షి సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం పూజా చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నాయి.

తెలుగులో ఆమె నటిస్తున్న సినిమాల్లో వరుణ్ తేజ్ సరసన వాల్మీకి, అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అల.. వైకుంఠపురంలో అలాగే ప్రభాస్ జాన్ మూవీకి కూడా ఛాన్స్ కొట్టేసింది. తాజాగా ఉన్న సమాచారం ప్రకారం పూజా హెగ్డె మరో టాప్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. అఖిల్ అక్కినేని ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తన నాల్గవ మూవీని చేస్తున్నారు.

ఇప్పటికే ఈమూవీ షూటింగ్ సగం వరకు పూర్తైనట్లు సమాచారం. ఈమూవీలో పూజా హెగ్డెను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను కూడా విడుదల చేశారు చిత్రయూనిట్. పూజా హెగ్డె వెల్ కమ్ టూ అబ్రార్డ్ అని ఒక ఫోటోను విడుదల చేశారు. త్వరలోనే పూజా ఈమూవీ షూటింగ్ లో పాల్గోననుంది. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈసినిమాను గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -