తెలంగాణలో పిరమాల్ గ్రూప్‌ రూ.500 కోట్ల పెట్టుబడులు

486
ktr
- Advertisement -

తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది పిరమాల్ గ్రూప్. దావోస్ పర్యటన సందర్భంగా పిరమాల్ గ్రూప్ ఛైర్మన్ అజయ్ పిరమాల్‌తో భేటీ అయ్యారు మంత్రి కేటీఆర్.

మంత్రి కేటీఆర్ తో సమావేశం అనంతరం పిరమల్ ఫార్మా ను విస్తరించేందుకు ముందుకొచ్చింది. రానున్న మూడు సంవత్సరాల్లో 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది పిరమాల్ గ్రూప్.

ప్రస్తుతం తెలంగాణలో తనకున్న 14 వందల మంది ఉద్యోగులకు అదనంగా మరో ప్రత్యక్ష 600 ఉద్యోగాలు కల్పించేందుకు ఈ పెట్టుబడితో అవకాశం కలుగుతుం. వచ్చే నెల తెలంగాణలో పర్యటించనున్న పిరమాల్ గ్రూప్ తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాలసీల నేపథ్యంలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్లను హైదరాబాద్ కి తరలించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది.

- Advertisement -