గ్రీన్ ఛాలెంజ్..మొక్కలు నాటిన పుట్ట మధు

446
putta madhu
- Advertisement -

పర్యావరణ పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ స్ఫూర్తి దాయకం అన్నారు పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధు. సింగరేణి సంస్ధ డైరెక్టర్ చంద్రశేఖర్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ను పుట్ట మధు స్వీకరించారు. పెద్దపల్లి మండలంలోని నాగారం గ్రామంలో మొక్కలు నాటారు.

ఈసందర్భంగా పుట్టా మధు మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించిన సింగరేణి సంస్ధ డైరెక్టర్ తనకు గ్రీన్ ఛాలెంజ్ సవాల్ ను విసిరారని తెలిపారు. ఈ నేపథ్యంలో తాను గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటానని అన్నారు. మంధని నియోజకవర్గంలోని ముగ్గురు ఎంపీపీలు రాచకొండ లక్ష్మీ(కమాన్ పూర్), ఆరెల్లి దేవక్క (రామగిరి), కొండ శంకర్(మంధని) లకు గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసిరినట్లు తెలిపారు.

- Advertisement -