దేశానికి సేవ చేయడం కోసమే బీజేపీతో కలిశా

380
Pawan Kalyan
- Advertisement -

దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతోనే బీజేపీతో కలిశానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌. భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన భారతమాత మహా హారతి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. దేశ సేవలో కర్పూరంలా కరిగిపోవాలనిపిస్తోందని అన్నారు.

తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. దేశం కోసం ఎందరో బలిదానాలు చేశారని, వారి త్యాగాలు, లక్ష్యాల కోసమే వచ్చా అని స్పష్టం చేశారు. దేశానికి బలమైన నాయకత్వం కావాలని, మోదీ నాయకత్వంతోనే అది సాధ్యమన్నారు. . దేశాన్ని భద్రంగా ఉంచే నాయకత్వం బీజేపీలోనే ఉందని అన్నారు.

- Advertisement -