క‌రోనా…రూ.2 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన ప‌వ‌న్‌

422
pawan
- Advertisement -

క‌రోనా మ‌హమ్మారి రోజురోజుకి పంజా విసురుతున్న నేప‌థ్యంలో త‌మ‌వంతుగా సాయం అందించేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు ముందుకువ‌స్తున్నారు. ఇప్ప‌టికే టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ వంతుగా రూ. 500 కోట్ల విరాళాన్ని అంద‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌గా తాజాగా వీరిబాట‌లోనే న‌డిచారు జ‌న‌సేన అధినేత‌,సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50లక్షలు,ఏపీ సీఎం సహాయ నిధికి రూ. 50 లక్షలు ఇస్తున్నట్టు ప్రకటించారు ప‌వ‌న్. అలాగే ప్రధానమంత్రి సహాయనిధికి రూ.కోటి రూపాయల ఆర్ధిక సాయం చేయబోతున్నట్టు తెలిపారు.

ఇక ఇప్ప‌టికే నితిన్ 10 లక్షలు, వినాయక్ రూ.5లక్షల విరాళాలు ప్రకటించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రుల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం రూ. 10లక్షల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు.

- Advertisement -