పాలకొల్లులో జనసేన ఫిలిం ఇనిస్టిట్యూట్

306
Pawan Kalyan Janasena
- Advertisement -

తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది దిగ్గజాలను పరిచయం చేసిన పాలకొల్లులో ఫిలిం ఇన్ స్టిట్యూట్ ను ప్రారంభించనున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎస్వీ రంగారావు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ గా ఈ సంస్థకు పేరు పెట్టినట్టు అధికారికంగా వెల్లడించింది జనసేన పార్టీ. అల్లు రామలింగయ్య, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ వంటి సినీ దిగ్గజాలు పాలకొల్లు నుంచి వచ్చారని జనసేన పార్టీ తెలిపింది.

ఈ విషయమై పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ మాట్లాడుతూ… ఈ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ కు హరిరామజోగయ్య చైర్మన్ గా వ్యవహరిస్తారని తెలిపారు. ఈ ఇన్ స్టిట్యూట్ లో నటన, దర్శకత్వంలో శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ ఇన్ స్టిట్యూట్ ప్రిన్సిపాల్ గా రాజా వన్నెంరెడ్డి వ్యవహరిస్తారనీ, సంస్థ ప్రారంభోత్సవానికి పవన్ కల్యాణ్ వస్తారని ప్రకటించారు.

- Advertisement -