గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు ప్రసంశల జల్లు

372
Green
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పటికే 4కోట్లు మైలు రాయి దాటిన ఈగ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం మరింత ఉత్సాహంగా సాగుతుంది. తాజాగా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ రైల్వేస్ చైర్మన్ రాధా మోహన్ సింగ్ గ్రీన్ ఛాలెంజ్ పై ప్రశంసలు కురిపించారు. తార్నాకలోని ఇరిసెట్లో పార్లమెంటరీ స్టాడింగ్ కమిటి సమావేశం అయింది. ఈసందర్భంగా రాధా మోహన్ సింగ్ తో పాటు కమిటి సభ్యులు కూడా మొక్కలు నాటారు.

ఈ సందర్బంగా కమిటీ చైర్మన్ మరియు సభ్యులకు హారా హై తో భరా హై కాన్సెప్ట్ ను ఎంపీ సంతోష్‌ కుమార్ వివరించారు. పచ్చదనం పెంపొందించే ఈ కార్యక్రమాన్ని కమిటీ చైర్మన్ రాధా మోహన్ సింగ్ మరియు సభ్యులు ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని మరింత విసృతంగా ముందుకు తీసుకెళ్లాళని ఎంపీ సంతోష్ కుమార్ కు తెలియజేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తామూ భాగస్వాములం అవుతామనీ, తమతమ ప్రాంతాలలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసులెళ్తామని వెల్లడించారు.

- Advertisement -