ట్రెండ్ సెట్టర్‌గా హుజుర్‌నగర్‌ సభ: ఎమ్మెల్సీ పల్లా

571
palla rajeshwar reddy
- Advertisement -

హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ నిర్వహించబోయే బహిరంగసభ ట్రెండ్ సెట్టర్‌గా మారనుందని తెలిపారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ నెల 17 న హుజుర్‌నగర్ పట్టణంలో సీఎం కేసీఆర్ హాజరయ్యే భారీ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

సీఎం కేసీఆర్‌ని చూడటానికి,ఆయన మాటలు వినడానికి ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. సబ్భండ వర్గాలు స్వచ్ఛందంగా సభకు తరలిరానున్నారని తెలిపారు. తరలి వస్తున్నరు…

హుజుర్‌నగర్ ప్రజల అదృష్టం మేర వచ్చిన ఈ ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధి ని కోరుకుంటున్నారని తెలిపారు. హుజుర్‌నగర్ నియోజకవర్గంలో పులిచింతల బాధితుల సమస్యకు,రెవెన్యూ డివిజన్ సమస్యకు తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపెడుతుందన్నారు.

- Advertisement -