సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం…

547
cm kcr palabishekam
- Advertisement -

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఆర్టీసీ ఉద్యోగులు. పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేసిన సూర్యపేట జిల్లా ఆర్టీసీ ఉద్యోగులు సీఎంకు పాలాభిషేకం చేశారు.

ఆర్టీసీని లాభాల బాట పట్టించడం, సరుకు రవాణా విభాగాన్ని పటిష్టం చేయడం, కార్మికులకు ఇచ్చిన హమీల అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం సంతకం చేశారు. ఆర్టీసీలో పని చేసే ప్రతీ ఉద్యోగికీ పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయం వర్తించనుంది.

- Advertisement -