లాంఛనంగా ప్రారంభమైన `ఒకడు`

526
okadu
- Advertisement -

అఖిల్ రెడ్డి హీరోగా అరుణ- కల్యాణి టాకీస్ బ్యానర్ పై కృష్ణ చైతన్య దర్శకత్వంలో ముత్తయ్య, సోమరాజు కల్యాణి నిర్మాతలుగా `ఒకడు` అనే కొత్త చిత్రం శనివారం రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి శేఖర్ మాస్టర్ క్లాప్ ఇవ్వగా.. సత్య మాస్టర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. స్క్రిప్ట్‌ను బి.వి.ఎస్.రవి అందించారు.

ఈ సందర్బంగా…దర్శకుడు కృష్ణచైతన్య మాట్లాడుతూ “ఇది నా మొదటి చిత్రం. మంచి అనుభవమున్న టీమ్‌తో కలిసి పనిచేస్తున్నాను. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్‌తో థ్రిల్లర్ సబ్జెక్ట్‌గా రూపొందే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ 15 లేదా 16 తేదీ నుంచి మొదలవుతుంది. 5 షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేస్తున్నాం. రామోజీ ఫిల్మ్
సిటీ, కాకినాడ పరిసర ప్రాంతాల్లో షూట్ జరుగనుంది“ అన్నారు.

నిర్మాత ముత్తయ్య మాట్లాడుతూ “కొత్త కథనంతో అతి త్వరలో మీ ముందుకు వస్తున్నాం. ఈ `ఒకడు` సినిమాను ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇస్తుందని నమ్మకంగా చెప్పగలను“ అని అన్నారు.

హీరో అఖిల్ రెడ్డి మాట్లాడుతూ “నేను నటిస్తున్న తొలి చిత్రమిది. మంచి స్క్రిప్ట్‌తో పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోయే ఈ సినిమాలోని ప్రతి సీన్
ప్రతి క్షణం ప్రేక్షకులకు టెన్షన్ క్రియేట్ చేసేలా ఉంటుంది. తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాను“ అన్నారు.

- Advertisement -