అధికారిక లాంఛనాలతో నరసింహారెడ్డి అంత్యక్రియలు

468
ex minister Narayana Reddy
- Advertisement -

గత కొద్దికాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాజీ మంత్రి మాదాటి నరసింహారెడ్డి హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పలు పార్టీలకు చెందిన రాజకీయనాయకులు ఆయన ఘన నివాళి అర్పించారు. ఇక నరసింహారెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

నరసింహారెడ్డి స్వస్థలం భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండలం, మొసలపల్లి. దివంగత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు.

ఆయన మృతి పట్ల కరీంగనర్ మాజీ ఎంపీ, ప్రస్తుత ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబసభ్యలకు సానుభూతి తెలిపారు.

- Advertisement -