కవిత ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం పట్ల ప్రవాసుల హర్షం..

414
TRS NRI
- Advertisement -

ప్రజా నాయకురాలైన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశమిచ్చిన టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కు ఎన్నారై టీఆర్‌ఎస్‌ యూకే సలహా మండలి వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ కృతఙ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసి, ఎంపీగా రాష్ట్రానికే కాకుండా యావత్ దేశానికి సేవలందించారని అన్నారు.

అటు జాగృతి అధ్యక్షురాలిగా.. తెలంగాణ ఆడబిడ్డగా మన సంస్కృతి సంప్రదాయాలని విశ్వవ్యాప్తం చేసారని, ఇటువంటి గొప్ప నాయకురాలు అనునిత్యం ప్రజల్లో ఉండాలనే సంకల్పంతో కేసీఆర్ కవితకి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో అటు క్షేత్రస్థాయిలోనే కాకుండా ఇటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలలో అలాగే ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని నింపారని తెలిపారు.

ఈ సందర్భంగా ప్రవాసులందరి పక్షాన సీఎం కేసీఆర్‌కు సిక్కా చంద్రశేఖర్ గౌడ్ కృతఙ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులంతా బాధ్యతగా ఓటేసి కవితను గెలిపించాలని ఆయన కోరారు.

- Advertisement -