తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్..

467
election commission
- Advertisement -

తెలుగు రాష్ట్రాలలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఏపీలో మూడు స్థానాలకు, తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏపీలో కరణం బలరాం కృష్ణమూర్తి ,అల్లా కాళీకృష్ణ ,వీరభద్ర స్వామి రాజీనామాలతో మూడు స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణలో యాదవ్ రెడ్డిపై అనర్హత వేటుతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.

ఈ ఎన్నికల నోటిఫికేషన్‌ ఆగస్టు 7వ తేదీన విడుదల కానుండగా.. ఆగస్టు 14న చివరి తేదీగా ఖరారు చేసింది. అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ఆగస్టు 16న..నామినేషన్ల ఉపసంవరణ కోసం ఆగస్టు 19వ తేదీ వరుకు ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.ఇక పోలింగ్‌ను ఆగస్టు 26న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించనున్నారు.ఆదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు.

- Advertisement -