ధోనీ,ధావన్‌లకు షాకిచ్చిన లక్ష్మణ్‌..!

527
laxman
- Advertisement -

ఇటీవలి కాలంలో మాజీ ఆటగాళ్లు తమ ఫేవరేట్ టెస్ట్, వన్డే, టీ20 జట్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ కూడా చేరిపోయారు. ఆస్ట్రేలియా వేదికగా మరి కొన్ని నెలల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం హైదరాబాద్ మాజీ ఆటగాడు లక్ష్మణ్‌ తన కలల జట్టును ప్రకటించారు. అయితే ఈ జట్టులో లక్ష్మణ్ మహేంద్రసింగ్ ధోనీకి శిఖర్ ధవన్‌కు చోటివ్వలేదు.

MS Dhoni and Shikhar Dhawan

ఇండోర్‌లో శ్రీలంకతో జరిగిన రెండో టీ20 సందర్భంగా లక్ష్మణ్ తనన కలల జట్టును కూర్చాడు. కొత్త కుర్రాడు శివం దూబే, విమర్శలు ఎదుర్కొంటున్న కీపర్ రిషభ్ పంత్‌లకు లక్ష్మణ్ చోటివ్వడం గమానార్హం. కాగా, ప్రపంచకప్ తర్వాత క్రికెట్‌కు దూరంగా ఉంటున్న ధోనీ భవిష్యత్తుపై ఇప్పటికే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో ఆడతాడని కొందరు, లేదని కొందరు అంటున్నారు. అయితే, ధోనీ మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. లక్ష్మణ్ ప్రస్తుతం క్రికెట్‌ విశ్లేషకుడు, వ్యాఖ్యాతగా ఉన్న సంగతి తెలిసిందే.

లక్ష్మణ్ ఎంపిక చేసిన టీ20 ప్రపంచకప్ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మనీశ్ పాండే, శివం దూబే, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్.

- Advertisement -