జనసేనకు నితిన్ విరాళం…

299
pawan nithin
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు యంగ్ హీరో నితిన్‌ వీరాభిమాని అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డీ హైడ్రేషన్‌తో బాధపడుతున్న పవన్‌ను నితిన్ తండ్రి సుధాకర్‌ రెడ్డి కలిశారు .భీమవరంలో పవన్‌ని కలిసిన సుధాకర్ రెడ్డి జనసేనకు రూ. 25 లక్షల విరాళాన్ని అందజేశారు.

Nithiin-Pawan

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సోదరుడు నితిన్ నా ఆరోగ్యం గురించి వాకబు చేసినందుకు సంతోషంగా ఉంది. ఎంతో అభిమానంగా జనసేనకు విరాళం పంపించారు. నితిన్‌కు, సుధాకర్‌రెడ్డిగారికి కృతజ్ఞతలు అని తెలిపారు.

హీరోగా, రాజకీయనాయకుడిగా ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిందే. పీకే క్రియేటివ్ వర్క్స్‌ పై తన వీరాభిమాని నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా తీశారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది.

- Advertisement -