సెప్టెంబర్‌లో “నిన్ను తలచి”..!

331
ninnu talachi
- Advertisement -

ఎస్ ఎల్ యన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఓబిలేష్ మొదిగిరి, నేదురుమల్లి అజిత్ కుమార్ నిర్మాతలుగా, అనిల్ తోట దర్శకునిగా తెరకెక్కిన చిత్రం నిన్ను తలచి. ఓ క్యూట్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాతో వంశి యాకసిరి, స్టెఫీ పటేల్ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. స్వతంత్ర దినోత్సవం అలానే రక్షాబంధన్ సందర్బంగా ఈ సినిమాకి సంబందించిన లేటెస్ట్ పోస్టర్ విడుదల చేశారు. ఇక ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్‌తో పాటు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను సెప్టెంబర్ 10న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా నిర్మాతలు తెలిపారు.

దర్శకుడు అనిల్ తోట మాట్లాడుతూ.. అనుకున్న బడ్జెట్, అనుకున్న టైంలో ఈ సినిమాను పూర్తి చేయగలిగాము. నా కథ ని నమ్మి సినిమా తీయడానికి ముందుకు వచ్చి, నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు నా కృతజ్ఞతలు. ఇక ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న వంశి, అసలు కొత్త వాడిలా అనిపించడు. ఈ సినిమాకి వంశి నటన కచ్చితంగా ప్లస్ అవుతుంది అని నేను నమ్మతున్నా. అలానే స్టెఫీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్ రిలీజ్‌కి రెడీ అవుతున్నాం. త్వరలోనే వీడియో సాంగ్స్ , ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాము అని తెలిపారు.

Ninnu Thalachi

నిర్మాత అజిత్ కుమార్ మాట్లాడుతూ.. ఒక హానెస్ట్ అట్టెంప్ట్ చేశాము.. ఈ సినిమాను కేవలం ఒక ప్రేమ కథ లా కాకుండా అటు ఫ్యామిలీ ఇటు యూత్‌ని ఆకట్టుకునేలా రెడీ చేయడం జరిగింది. మా సినిమాకు మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తుందని నేను బలంగా నమ్మతున్నా,త్వరలోనే మా సినిమాలో ఉన్న వీడియో సాంగ్స్ ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. వంశి, స్టెఫీ పటేల్ జంట ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సెప్టెంబర్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నం అన్నారు.

హీరో వంశి మాట్లాడుతూ.. ఓ ఫీల్ గుడ్ మూవీతో నేను టాలీవుడ్‌కి పరిచయం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్ అనిల్ తోట అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమాను రెడీ చేశారు. అలానే ఎక్కడ లోటు కాకుండ నిర్మాతలు ఈ సినిమాను రూపొందించారు. సెప్టెంబర్ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మా నిన్ను తలచి టీంని ఆడియన్స్ ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు.

- Advertisement -