కేటీఆర్‌ను కలిసిన ఆదిలాబాద్ జ‌డ్పీ చైర్మ‌న్ రాథోడ్ జ‌నార్ధ‌న్..

343
- Advertisement -

కొత్తగా ఎన్నికైన ఆదిలాబాద్ జ‌డ్పీ చైర్మ‌న్ రాథోడ్ జ‌నార్ధ‌న్, వైస్ చైర్మ‌న్ ఆరె రాజ‌న్న మంత్రి అల్లోల‌ ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామ‌న్న‌తో క‌లిసి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మంగళవారం ప్ర‌గతి భ‌వ‌న్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరితో పాటు కో ఆప్ష‌న్ స‌భ్యులు ప‌లువురు జ‌డ్పీటీసీ స‌భ్యులు ఉన్నారు.

ఈ సందర్భంగా వీరిని కేటీఆర్ అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో డైరీ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ లోక భూమా రెడ్డి, జిల్లాకు చెందిన ప‌లువురు టీఆర్ఎస్ నాయ‌కులు, త‌దిరులు పాల్గొన్నారు.

KTR

- Advertisement -