- Advertisement -
ఇటివలే జరిగిన జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో ఎకగ్రీవంగా ఎన్నికైన పలువురు జిల్లా పరిషత్ చైర్మన్ లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ఈసందర్భంగా వారికి కేటీఆర్ శుభాకాంక్షాలు కలిశారు. తెలంగాణలో 32కు 32 జెడ్పీ చైర్మన్లు గెలుచుకోవడం గొప్ప విషయం అన్నారు కేటీఆర్. గెలిచిన వారు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు సేవ చేయాలని వారికి సూచించారు. కేటీఆర్ ను కలిసిన వారిలో
రంగారెడ్డి జిల్లా జెడ్పి చైర్మన్ – తీగల అనితా రెడ్డి,
మహబూబ్ నగర్ జెడ్పి చైర్మన్ – స్వర్ణ సుధాకర్,
మంచిర్యాల జెడ్పి చైర్మన్ – నల్లాల భాగ్య లక్ష్మీ,
రాజన్న సిరిసిల్ల జెడ్పి ఛైర్మన్ – న్యాలకొండ అరుణ,
వికారాబాద్ జెడ్పి చైర్మన్ – పట్నం సునీతా మహేందర్ రెడ్డి,
మేడ్చల్ జెడ్పి చైర్మన్ – శరత్ చంద్ర రెడ్డి లు ఉన్నారు.
- Advertisement -