కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్ ఛైర్మన్లు,వైస్ ఛైర్మన్లు..ఇవాళ సీఎం కేసీఆర్తో భేటీ కానున్నారు. ప్రగతి భవన్లో మధ్యాహ్నం జరిగే ఈ సమావేశానికి రావాల్సిందిగా వారికి ఆహ్వానం అందింది. ప్రజాప్రతినిధులకు పంచాయతీరాజ్చట్టం అమలు, ప్రభుత్వ లక్ష్యాలు, ఉద్దేశాలను ఈ సమావేశంలో వివరించనున్నారు. సమావేశం అనంరతం వారికి మధ్యాహ్న భోజనాన్ని ప్రగతిభవన్లో ఏర్పాటుచేశారు.
జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో అత్యధిక స్థానాలు సొంతం చేసుకున్న టిఆర్ఎస్… ఆ తర్వాత జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలో రాష్ట్రంలోని 32 జడ్పీ ఛైర్మన్ పీఠాలు కైవసం చేసుకుని క్లీన్స్వీప్ చేసింది. నూతనంగా ఎన్నికైన జడ్పీ చైర్మన్లు మర్యాదపూర్వకంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఇప్పటికే కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలోని 32 స్థానాలను క్లీన్స్వీప్ చేసింది టీఆర్ఎస్. చైర్మన్తో పాటు వైస్ చైర్మన్ పదవులనూ టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. కాగా, 32 మంది జడ్పీ ఛైర్మన్లలో 20 మంది మహిళలే ఉండడం విశేషం.