భారత్..324/4

253
- Advertisement -

నేపియర్‌లో జరిగిన తొలి వ‌న్డే గెలిచి జోరు మీదున్న టీమిండియా రెండో వ‌న్డేలోనూ శుభారంభం ద‌క్కించుకుంది. ఐదు వ‌న్డేల సిరీస్‌లో భాగంగా ఈ రోజు (శ‌నివారం) ప్రారంభ‌మైన రెండో వ‌న్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

తొలి వన్డేలో కివీస్‌ను చిత్తుచేసిన భారత్.. రెండో వన్డేలోనూ అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు, ఈ వన్డేలో గెలిచి భారత్ ఆధిక్యాన్ని తగ్గించాలని కివీస్ యోచిస్తోంది. టాస్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసి విలియమ్సన్ సేనపై ఒత్తిడి పెంచుతామన్నాడు. తొలి వన్డేలో దిగిన జట్టులో ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు.

India vs New Zealand

కివీస్ కెప్టెన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. వికెట్‌పై పచ్చిక ఉందని, దానిని వినియోగించుకుంటామని తెలిపాడు. ఓపెనర్లు ధవన్, రోహిత్ శర్మ, కెప్టెన్ కోహ్లీలను తొలి పది ఓవర్లలోనే పెవిలియన్ పంపి భారత్‌పై ఒత్తిడి పెంచేందుకు తమ బౌలర్లు సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. కాగా, 34 ఓవర్లు ముగిసే సరికి భారత్ 196 పరుగులు చేసింది. ధవన్ 66, రోహిత్ శర్మ 87 పరుగులతో చేసి అవుట్‌ అయ్యరు. విరాట్‌ 22,అంబటి రాయుడు 13తొ గ్రీజులో ఉన్నారు.

- Advertisement -