త్వరలో కొత్త పంచాయతీ రాజ్ చట్టం:ఎర్రబెల్లి

415
errabelli dayakararao
- Advertisement -

త్వరలో కొత్త పంచాయతీ రాజ్ చట్టం తేబోతున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఉమ్మడి జడ్పీ సమావేశంలో మాట్లాడిన ఎర్రబెల్లి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం వల్ల స్థానిక సంస్థల అధికారాలు గల్లంతయ్యాయని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం ద్వారా మళ్లీ స్థానిక సంస్థలకు అధికారాలు బదలాయిస్తామని వెల్లడించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునేలా కొత్త చట్టం తెస్తున్నామని, పంచాయతీ రాజ్‌ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తామని వ్యాఖ్యానించారు.

అవినీతి రహిత పాలన అందివ్వాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన అని,నిధుల విషయంలో కరీంనగర్‌కు పెద్దపీట వేస్తామని తెలిపారు. మిషన్‌ భగీరథను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రెవెన్యూ వ్యవస్థలో లోపాలున్నాయని, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -