తెలంగాణ వర్సిటీ ఇంచార్జీ వీసీగా నీతూ ప్రసాద్

494
neethu prasad
- Advertisement -

తెలంగాణ యూనివర్సిటీ ఇంచార్జి వీసీగా ఐఏఎస్ అధికారి నీతూ ప్రసాద్‌ నియమితులయ్యారు. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్‌గా పని చేస్తున్న నీతూ ప్రసాద్‌ను ఇంచార్జి వీసీగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో వీసీగా పనిచేసిన ఐఏఎస్ అధికారి అనిల్‌కుమార్ గత నెలలో పదవీ విరమణ చేశారు. నీతూ ప్రసాద్ గతంలో నిజామాబాద్ జాయింట్ కలెక్టర్‌గా, ఆమె భర్త రాజేశ్వర్‌కుమార్ ఎస్పీగా సేవలందించారు.

- Advertisement -