నానితో ‘ఎవరు’ ట్రైలర్..

388
Nani
- Advertisement -

టాలీవుడ్‌ హీరో అడివిశేష్ హీరోగా ‘ఎవరు’ సస్పెన్స్‌ థ్రిల్ల‌ర్ రూపొందుతోంది. ఈ సినిమాతో వెంక‌ట్ రామ్ జీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మాత‌లు. ఈ చిత్రంలో అడివిశేష్ సరసన రెజీనా క‌సండ్ర హీరోయిన్‌గా న‌టిస్తుంది. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Adavi sheshu

తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. సోమవారం ఉదయం 10.30 గంటలకు ‘ఎవరు’ సినిమా ట్రైలర్ ను న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా లాంచ్ చేయిస్తున్నారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ఆగ‌స్ట్ 23న విడుద‌ల చేస్తున్నారు.

- Advertisement -