నాగబాబు వర్సెస్ కేఏ పాల్

292
nagababu ka paul
- Advertisement -

ఎన్నికల నామినేషన్ల గడువు సమీపిస్తున్న కొద్ది ఏపీలో పొలిటికల్ హీట్ తారస్ధాయికి చేరింది. మెగా బ్రదర్ నాగబాబు జనసేనలో చేరిపోవడం ఆయన నర్సాపురం ఎంపీగా బరిలో దిగడం ఖాయమైంది. ఇక ఇదే స్ధానం నుండి బరిలోకి దిగనున్నారు క్రైస్తవ మత ప్రచారకుడు,ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్. ఈ నెల 22న ఆయన నామినేషన్ వేయనుండగా ఇప్పుడు నర్సాపురం ఎంపీ స్ధానం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

పవన్‌పై తనదైన శైలీలో సెటైర్లు వేసే కేఏ పాల్ ఎన్నికల తర్వాత జనసేన ..ప్రజారాజ్యం పార్టీలాగే మూతపడుతుందని ఎద్దేవా చేశారు. అంతేగాదు పవన్‌ కోరుకుంటే తాను అధికారంలోకి వచ్చాక మహిళా మంత్రిపదవి ఇస్తానిన చురకలు అంటించారు. తనపై ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోని పాల్..ఏ చిన్న అవకాశం వచ్చినా పవన్‌ను మాత్రం వదలడం లేదు. ఈ నేపథ్యంలో మెగాబ్రదర్ నాగబాబు పోటీపడుతున్న నర్సాపురం నుండి కేఏ పాల్ పోటీచేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక పవన్‌పై ఈగ వాలితే సహించని నాగబాబు..కేఏ పాల్‌కు ఎలాంటి కౌంటర్ ఇస్తారనే దానిపై అంతా వేచిచూస్తున్నారు.ఇప్పటివరకు జనసేన కార్యకర్తగా కూడా లేని నాగబాబు కొంతకాలంగా యూట్యూబ్ చానెల్ ద్వారా జనసేనకు మద్దతుగా పనిచేస్తున్నారు. తాను పార్టీలో లేకపోయినా తన తమ్ముడి గెలుపుకోసం కృషి చేస్తానని చెబుతూ వచ్చారు. అయితే ఇప్పుడు నేరుగా పార్టీలోకి ప్రవేశించి ప్రత్యక్షంగా జనసేన తరపున పనిచేయబోతున్నారు. దీంతో నాగబాబు రాజకీయంగా ఎలాంటి వ్యూహాలకు పదునుపెడతారా అన్నదానిపై మెగాఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

మొత్తంగా టీడీపీ,వైసీపీ తరపున అభ్యర్థులు బరిలో ఉన్నా పోటా కాస్త నాగబాబు వర్సెస్ కేఏ పాల్ గా మారడంతో నర్సాపురం స్ధానంపై జెండా ఎగురవేసేది ఎవరు,ప్రజలు ఎవరికి జై కొడతారా అన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -