బీజేపీలోకి నాదెండ్ల మనోహర్..క్లారిటీ ఇచ్చిన జనసేన

250
nadendlamanohar
- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ పార్టీ మారుతారనే వార్తలు జోరుగా జరుగుతున్నాయి. తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్.. గుంటూరు జిల్లా సమీక్ష నిర్వహించడం.. ఆ సమావేశానికి నాదెండ్ల మనోహర్ హాజరుకాకపోవడంతో.. ఇక ఆయన పార్టీని వీడుతున్నారనే ప్రచారం జోరందుకుంది.

ఎన్నికలకు ముందు జనసేనలో చేరి, గత ఎన్నికల్లో తెనాలి నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు నాదెండ్ల మనోహర్. తాజాగా ఈరూమర్లపై స్పందించారు నాదెండ్ల మనోహర్. అమెరికా పర్యటనలో ఉన్న కారణంగానే నాదెండ్ల సమీక్షా సమావేశానికి హాజరు కాలేదని స్పష్టం చేసింది. ఆయన పార్టీని వీడబోరని, కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని వెల్లడించింది జనసేన పార్టీ.

- Advertisement -