ప్రభాస్ బాహుబలి విజయ దరహాసంతో ఇపుడు సుజిత్ డైరెక్షన్ లో సాహో చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాను నాలుగు భాషల్లో విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. బాహుబలి క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని సాహో చిత్రాన్ని దేశం మొత్తం దింపడానికి రెడీ అయ్యింది. సాహో తర్వాత ప్రభాస్ చిత్రం ఏమిటనే దాని మీద ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది.
అదేమిటంటే తమిళ డైరెక్టర్ మురుగదాస్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. తమిళ దర్శకుడు మురుగదాస్ కి తమిళంలో ఎంత క్రేజ్ ఉందొ ఇక్కడ తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది. మురుగదాస్ కేవలం తమిళంలోనే కాదు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటిన దర్శకుడు. మరి నేషనల్ వైడ్ గా సినిమాలు చెయ్యడంలో సిద్ధహస్తుడైన మురుగదాస్ డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్నాడని తెలియగానే ఆ న్యూస్ విపరీతంగా ప్రచారంలోకి వచ్చేసింది.
స్పైడర్ ప్రమోషన్స్ లో భాగంగా మురగదాస్ గత నెల రోజుల నుంచి హైదరాబాద్ లో మకాం వేశారు. ఈ నేపథ్యంలో స్టార్ హీరోలను కలుస్తూ టచ్ లో ఉంటున్నారు. దీంతో మురగదాస్ తదుపరి సినిమా తెలుగులోనే ఉంటుందని…అదీ ప్రభాస్ తో ముందుగా సినిమా చేస్తున్నారని జోరుగా ప్రచారం సాగింది. అయితే అవన్నీ కేవలం రూమర్లు మాత్రమేనని మురగదాస్ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుండ బద్దలుగొట్టేసారు.
ప్రభాస్ ను రెండేళ్ల క్రితం స్నేహ పూర్వకంగా కలిసాను. మళ్లీ ఆయన్ను కలవలేదు. ప్రస్తుతం ప్రభాస్తో సినిమా చేసే ఆలోచన లేదు. తమిళ్లో నేను కమిట్ అయిన సినిమాలున్నాయి. తమిళ్లో కొందరు సూపర్స్టార్లకు కథలు చెప్పాను. కానీ కాల్షీట్లు సర్దుబాటు కాలేదు. స్టార్ల వీలును బట్టి నా తదుపరి సినిమా ఉంటుంది“ అని తెలిపారు. మురుగదాస్ చెప్పినదాన్ని బట్టి చూస్తే ఈసారి తమిళ సూపర్స్టార్తో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది.